logo

నంద్యాలను నందనవనంగా తీర్చిదిద్దుతాం, 18 వార్డులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఎన్ఎండి ఫరూక్

*ఎన్జీవోస్ కాలనీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ*

*నంద్యాలను నందనవనంగా తీర్చిదిద్దుతాం*

*18 వార్డులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఎన్ఎండి ఫరూక్*

సార్వర్థిక ఎన్నికల్లో భాగంగా 18వ వార్డ్ టీడీపీ నాయకులు రాంపల్లె రామిరెడ్డి, రామయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు , మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రోడ్ షో లో పాల్గొని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వాటి ఉపయోగాల గురించి ప్రజలకి వివరించారు . మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం , తల్లికి వందనం కింద సంవత్సరానికి 15000 , సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు , రైతులకు ఏడాదికి 20వేల రూపాయలు , నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో లేదా నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు , బీసీ రక్షణ చట్టం గురించి ప్రజలకు వివరించారు . ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి పట్టణ అధ్యక్షులు మునియర్ ఖలీల్ , జనసేన నాయకులు సాయి మరియు టిడిపి , జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

3
112 views